పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలి ప్రజాశక్తి పుస్తక ప్రదర్శనలో ఐసిడిఎస్ పీడీ రాజేశ్వరి ప్రజాశక్తి-విజయనగరం కోట బాలలు పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలని ఐసిడిఎస్ పీడీ ఎం.రాజేశ్వరి అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్టిసి కాంప్లెక్సు ప్రాంగణంలోని ప్రజాశక్తి బుకహేౌస్ వద్ద ఏర్పాటు చేసిన పిల్లల పుస్తక ప్రదర్శనను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెల్ఫోన్లకు అతుక్కుపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బాలబాలికల్లో పుస్తక పఠనం తగ్గుతోందని అన్నారు. దీనివల్ల వ్యక్తిత్వ వికాసం, విజ్ఞానం లోపించే ప్రమాదం ఉందన్నారు. పుస్తక పఠనంతోనే మనోవికాసం సాధ్యమవుతుందని, అందుకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఇందుకోసం ప్రజాశక్తి బుకహేౌస్లో విరివిగా పుస్తకాలు అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. ఈ పుస్తకాలపై ఇస్తున్న 40శాతం రాయితీని వినియోగించుకోవాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర సభ్యులు కేసలి అప్పారావు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, వారి కోసం ప్రజాశక్తి ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. చిన్నారుల మేథోశక్తి పెంచేందుకు ఉపయోగపడే ఎన్నో పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. ప్రజాశక్తి శ్రీకాకుళం ఎడిషన్ మేనేజర్ పి.కామినాయుడు (గణేష్) మాట్లాడుతూ ప్రజాశక్తి కేవలం వార్తలు, ప్రజా సమస్యల వెలికితీతకే పరిమితం కాకుండా సమాజాభివృద్ధికి దోహదపడే పుస్తకాలను అందుబాటులో ఉంచుతుందని అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజాశక్తి బుకహేౌస్లలో రాయితీపై పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. చిన్నారులకు ఉపయోగపడే 150 రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజాశక్తి జిల్లా కన్వీనర్ కె.రమేష్నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది, విలేకర్లు పాల్గొన్నారు. title>
Popular posts
రామ రాజ్యాన్ని తలపిస్తో0ది.యం. యల్.ఏ.కడు బండి శ్రీనివాసరావు
• seerapu sreenivaas rao
<no title>
• seerapu sreenivaas rao
జాతీయ పత్రికా దినొీత్సవం సందర్బంగా డా..బి.ఆర్.అంబేద్కర్ యుానివర్సటి లొీ వైస్ చాన్సలర్ డా..కుాన రాంజీ గారు,జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి యల్.రమేష్ గారు,మీడియా జె.ఎ.సి.కన్వనర్ యస్.జొీగినాయడు గారు మరియు ప్రొఫసర్స్ చేతుల మీదగా చీరు సత్కరం...జరగింది
• seerapu sreenivaas rao
<no"స్నేహ"ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం శృంగవరపుకోట స్నేహ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 11 వతేది బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు అట్లూరి శ్రీ వెంకటరావు తెలిపారు . సోమవారం ఉదయం పి.ఆర్. షటిల్ కోర్ట్ ఆవరణలో నిర్వహించిన స్నేహ స్వచ్చంద సంస్థ సర్వసభ్యసమావేశంలో సంస్థ రాబోయే రెండునెలలలో చేయతలపెట్టిన కార్యాక్రమాలగురుంచి చర్చించడం జరిగింది .ఈనెలలో 6వ తేదీన మామిడిపల్లి (ఎస్.కోట)లో కరోనా (కోవిడ్-19) పై ప్రజల్లో చైతన్యం తేవడానికి ఒక కార్యక్రమం, అలాగే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా రక్తసేకరణ అవసరం ఉందిఅని ఈనెల 11వ తేదీన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటుచేయాలని సభ్యులందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు వెంకటరావు తెలిపారు .ఈ సందర్భంగా ఈనెల 21,22 తేదీలలో ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఉత్తరాంధ్ర బ్యాడ్మింటన్ లీగ్ పోటీలలో పి.ఆర్.షటిల్ కోర్ట్ సభ్యులు ద్వితీయ స్థానం సాధించి 30 వేల రూపాయలు ,కప్పు సాధించారు వారిని స్నేహ స్వచ్చంద సంస్థ,మరియు పి.ఆర్. షటిల్ కోర్ట్ సభ్యులు అధ్యక్షకార్యదర్సులు వెంకట్రావు,సుబ్బారావు ,చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు సభ్యులు రామకృష్ణ, గంగాభవని,డా,,వేణు ,డా ,,వరలక్ష్మి ,ప్రకాష్,మురళి,శ్రీను ,రాజు,తిరుపతిరావు ఇతరసభ్యులు అభినందించారు. title>
• seerapu sreenivaas rao
<no title>
• seerapu sreenivaas rao
Publisher Information
Contact
prajalukoreswetchamonthly@gmail.com
.3-176,sreenivaasa colony,srungavarapukotapost,vizianagaram
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn