పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలి ప్రజాశక్తి పుస్తక ప్రదర్శనలో ఐసిడిఎస్‌ పీడీ రాజేశ్వరి ప్రజాశక్తి-విజయనగరం కోట బాలలు పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలని ఐసిడిఎస్‌ పీడీ ఎం.రాజేశ్వరి అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్‌టిసి కాంప్లెక్సు ప్రాంగణంలోని ప్రజాశక్తి బుకహేౌస్‌ వద్ద ఏర్పాటు చేసిన పిల్లల పుస్తక ప్రదర్శనను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెల్‌ఫోన్లకు అతుక్కుపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బాలబాలికల్లో పుస్తక పఠనం తగ్గుతోందని అన్నారు. దీనివల్ల వ్యక్తిత్వ వికాసం, విజ్ఞానం లోపించే ప్రమాదం ఉందన్నారు. పుస్తక పఠనంతోనే మనోవికాసం సాధ్యమవుతుందని, అందుకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఇందుకోసం ప్రజాశక్తి బుకహేౌస్‌లో విరివిగా పుస్తకాలు అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. ఈ పుస్తకాలపై ఇస్తున్న 40శాతం రాయితీని వినియోగించుకోవాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర సభ్యులు కేసలి అప్పారావు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, వారి కోసం ప్రజాశక్తి ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. చిన్నారుల మేథోశక్తి పెంచేందుకు ఉపయోగపడే ఎన్నో పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. ప్రజాశక్తి శ్రీకాకుళం ఎడిషన్‌ మేనేజర్‌ పి.కామినాయుడు (గణేష్‌) మాట్లాడుతూ ప్రజాశక్తి కేవలం వార్తలు, ప్రజా సమస్యల వెలికితీతకే పరిమితం కాకుండా సమాజాభివృద్ధికి దోహదపడే పుస్తకాలను అందుబాటులో ఉంచుతుందని అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజాశక్తి బుకహేౌస్‌లలో రాయితీపై పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. చిన్నారులకు ఉపయోగపడే 150 రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజాశక్తి జిల్లా కన్వీనర్‌ కె.రమేష్‌నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది, విలేకర్లు పాల్గొన్నారు. title>


Popular posts
రామ రాజ్యాన్ని తలపిస్తో0ది.యం. యల్.ఏ.కడు బండి శ్రీనివాసరావు
<no title>*కొత్త ప్రెస్ అక్రిడేషన్ల జారీ లో విఫలమైన సమాచార శాఖ.పొడిగింపు తో పెద్దగా ప్రయోజనం లేదు*. రాష్ట్రంలో జర్నలిస్టులకు కొత్త ప్రెస్ అక్రిడేషన్స్ జారీ చేయటంలో సమాచార శాఖ పూర్తిగా విఫల మైంది.గత సంవత్సరం డిసెంబర్ చివర నాటికి గడువు ముగిసిననాటి నుండి పొడిగించు కుంటూ పోతున్నారు.అడిగే వారు లేనట్లు, గత నెలైతే అదికూడా లేకుండా చేశారు . రెండు వారాల లోగా అక్రిడేషన్లు ఇవ్వాలని హై కోర్టు ఆదేశించడంతో కోర్టు వాయిదాకు రెండు రోజుల ముందు, కోర్టు ధిక్కార భయంతో నవంబర్ 1న ,ఆదివారం సెలవు దినమై నప్పటికీ మరో మూడు నెలలు పొడిగిస్తూ మెమో విడుదల చేశారు.నిజానికి రెండు వారాల లోగా జారీ చేయలేదు కాబట్టి ఇది కూడా కోర్టు ధిక్కార మే అవుతుంది.పొడిగింపు వల్ల పెద్ద గా ప్రయోజనం లేదు.కొత్త వాటితోనే జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలు, హెల్త్ కార్డులు,ప్రమాద బీమా ,స్థానిక పత్రికలు యాడ్స్,తదితర వాటిని ముడి పెట్టారు. కొత్తవి రాకుండా ఏవేవి సాధ్యం కాదు .పైగా పొడిగించడం వల్ల కొత్తగా అర్హత సాధించిన వారు వాటిని కోల్పోతున్నారు .సంస్థలు మారిన వారికి ఈ పొడిగింపు వర్తింప చేయటం లేదు . అనర్హులను తొలగిస్తామంటూ , అర్హులకు కూ డా అక్రిడేషన్స్ లేకుండా చేయటం దారుణం. హెల్త్ కార్డులు,ప్రమాద బీమా కు ఆర్థిక శాఖ నుండి క్లియరెన్స్ వచ్చినా వాటి కొనసాగింపు ప్రక్రియ ప్రారంభించ లేదు.జర్నలిస్టుల పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలి......పి.సత్యనారాయణ,ఎడిటర్,మనభూమి దిన పత్రిక,cell9642575844
Image
నౌ మరణం నాస్తికోద్యమనికి లోటు.(విశాఖపట్నం).నాస్తికోధ్యం నాయకురాలు నౌ మరణం తీరని లోటని భారత నాస్తిక సమాజం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు వై.నూకరాజు ఇక్కడ ప్రకటనలోసంతాపాన్ని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు ప్రముఖ నాస్తికోధ్యమ నాయకులు గోరా -సరస్వతి గార్ల 9 వ సంతానం అయిన నౌ విజయవాడ పరిసరప్రా0తాల్లో పలు సేవకార్యక్రమాలు నిరంతరం చేసారని ఇతరదేశా లవారితో కూడా సమాజ సేవా కార్యక్రమాలు చేసారని మహిళలు,వికలాంగుల సంక్షేమం కోసం,చిన్నారుల చదువు కోసం పలు కార్యక్రమాలు చేపట్టారని గోరా తమ పిల్లలకు (తమ సంతానం )కు కులమతాలకు అతీతంగా అర్ధ వంతమైన పేర్లు పెట్టారని వై.నూకరాజు తెలిపారు
Image
జాతీయ పత్రికా దినొీత్సవం సందర్బంగా డా..బి.ఆర్.అంబేద్కర్ యుానివర్సటి లొీ వైస్ చాన్సలర్ డా..కుాన రాంజీ గారు,జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి యల్.రమేష్ గారు,మీడియా జె.ఎ.సి.కన్వనర్ యస్.జొీగినాయడు గారు మరియు ప్రొఫసర్స్ చేతుల మీదగా చీరు సత్కరం...జరగింది
Image
"వెలగని వీధి లైట్ తో ఇబ్బందులు"(శృంగవరపుకోట)స్థానిక శ్రీనివాసా కాలనీ లో సాహిణి వేణుగోపాల్ రావు,శీరాపు పాపన్న ఇంటి వద్ద ఉన్న వీధి లైట్ గత 10 రోజులు నుండి వెలగట0 లేదని స్థానికులు అంటున్నారు.ఫలితంగా ( పాదచారులు )ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు సంబంధిత అధికారులు స్పందించి వీధిలైట్ వెయ్యా లని స్థానికులు కోరుతున్నారు
Image