<no title>

విజయనగరం(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్)
జిల్లా నుండి వెళ్ళేందుకు ఈ పాస్ ఆన్లైనులోనే దరఖాస్తు చేసుకోవాలి • విజయనగరం జిల్లా ఎస్పీ బి . రాజకుమారి , ఐ . పి . ఎస్ . . . విజయనగరం నుండి వెళ్ళేందుకు ఈ పాస్ మంజూరు కొరకు ఇకపై ఆన్లైనులోనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీమతి బి . రాజకుమారి తే . 10 - 05 - 2020 ది . ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు . జిల్లా ఎస్పీ శ్రీ మతి బి . రాజకుమారి మాట్లాడుతూ - విజయనగరం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు ఈ - పాస్ మంజూరు కొరకు ఎవ్వరూ 6309898989 కు వాట్సాప్ చేయనవసరం లేదని , అదే విధంగా జిల్లా పోలీసు కార్యాలయాన్నికి సుదూర ప్రాంతాల నుండి రానవసరం లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేసారు . ఇందుకుగాను రాష్ట్ర డిజిపి కార్యాలయంలో ఒక వెబ్ సైటును ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు . రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలనుకొనేవారు . https://serviceonline.gov.in/epass/ ను సంప్రందించాలన్నారు . ఈ వెబ్ సైటులో ప్రయాణించే వ్యక్తి పూర్తి పేరు , ఫోను నంబరు , ఫోటో , గుర్తింపు కార్డుగా డ్రైవింగు లైసెన్సు , పాస్పోర్టు , ఓటరు గుర్తింపు కార్డు , పాన్ కార్డు , ఆధార్ కార్డులను చూపవచ్చునన్నారు . ఈ వెబ్ సైటులో ప్రయాణించే వ్యక్తి ఎక్కడి నుండి ఎక్కడకు ప్రయాణిస్తున్నా డన్న విషయాన్ని , ప్రాయాణానికి గల కారణాన్ని , ప్రయాణించే వాహనం వివరాలను పొందిపర్చాలన్నారు . వివరాలను పూర్తి చేసిన తరువాత పొందిపర్చిన వివరాలన్నియూ నిజమని , స్వంత డిక్లరేషను ఇవ్వవలసి ఉంటుందన్నారు . అనంతరం , సంబంధిత దరఖాస్తు ఏ జిల్లా నుండి ప్రయాణిస్తే ఆ జిల్లా ఎస్పీగార్కి వస్తుందని , క్యూఆర్ కోడ్ సహాయంతో పెర్మిషను పొందవచ్చునని జిల్లా ఎస్పీ తెలిపారు . అదే విధంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళబోయే వారి దరఖాస్తు ఫారంలను రాష్ట్ర డిజిపి కార్యాలయంకు పంపబడి , అక్కడ నుండి అనుమతులు వస్తాయని జిల్లా ఎస్పీ శ్రీమతి బి . రాజకుమారి ఒక ప్రకటనలో తెలిపారు .


Popular posts
నౌ మరణం నాస్తికోద్యమనికి లోటు.(విశాఖపట్నం).నాస్తికోధ్యం నాయకురాలు నౌ మరణం తీరని లోటని భారత నాస్తిక సమాజం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు వై.నూకరాజు ఇక్కడ ప్రకటనలోసంతాపాన్ని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు ప్రముఖ నాస్తికోధ్యమ నాయకులు గోరా -సరస్వతి గార్ల 9 వ సంతానం అయిన నౌ విజయవాడ పరిసరప్రా0తాల్లో పలు సేవకార్యక్రమాలు నిరంతరం చేసారని ఇతరదేశా లవారితో కూడా సమాజ సేవా కార్యక్రమాలు చేసారని మహిళలు,వికలాంగుల సంక్షేమం కోసం,చిన్నారుల చదువు కోసం పలు కార్యక్రమాలు చేపట్టారని గోరా తమ పిల్లలకు (తమ సంతానం )కు కులమతాలకు అతీతంగా అర్ధ వంతమైన పేర్లు పెట్టారని వై.నూకరాజు తెలిపారు
Image
విలేకర్లకు నిత్యావసరాల పంపిణీ
రామ రాజ్యాన్ని తలపిస్తో0ది.యం. యల్.ఏ.కడు బండి శ్రీనివాసరావు
"వెలగని వీధి లైట్ తో ఇబ్బందులు"(శృంగవరపుకోట)స్థానిక శ్రీనివాసా కాలనీ లో సాహిణి వేణుగోపాల్ రావు,శీరాపు పాపన్న ఇంటి వద్ద ఉన్న వీధి లైట్ గత 10 రోజులు నుండి వెలగట0 లేదని స్థానికులు అంటున్నారు.ఫలితంగా ( పాదచారులు )ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు సంబంధిత అధికారులు స్పందించి వీధిలైట్ వెయ్యా లని స్థానికులు కోరుతున్నారు
Image
<no పేద క్రీడాకారులకు దాతల వితరణ శృంగవరపుకోట ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ లో ఆదివారం బాలల దినోత్సవం సందర్భాగా శిక్షణ పొందుతున్న సీనియర్ గ్రూప్ క్రీడాకారులకు డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించినట్లు చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. ఈ టోర్నమెంట్ లోగెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వడానికి సోమవారం ఉదయం ముఖ్యాతిధులుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుకూరి రఘురాజు , ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు డా,,ఎస్ వి సత్యాశేఖర్,స్నేహస్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు అట్లూరి శ్రీ వెంకటరావు లు వచ్చారు ఈ సందర్భంగా కోచ్ శ్రీరాములు మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ,వారి స్తితి గతులగురించి వివరిస్తూ వీరందరూ క్రిడల్లో మేటి - ఆర్ధికంగా వెనుకబాటు అని చెప్పగానే స్పందించి, వెంటనే 10,000/-రూ విలువచేసే( బ్యాట్లు,షూ,క్రీడాదుస్తులు,షటిల్ కాక్స్ మొ,,) క్రీడాపరికారాలను దాతలు అందజేశారు .ఎస్. కోట జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంచేస్తున్న కందుల కృష్ణ నీరజ కి1000/- బ్యాట్ ,మౌనిక కి 800/-రూ క్రీడాదుస్తులను,అలాగే స్నేహ స్వచ్చంద సేవా సంస్థ కార్యదర్శి మంతా సుబ్బారావు హరీష్ కి1500/-రూ క్రీడా బూట్లు ,వైజాగ్ కి చెందిన సన్ రైజ్ స్పోర్ట్స్ యజమాని ప్రసాద్ 3000/-రూ విలువచేసే లీనింగ్ బ్యాట్ అందించారు.నీరజ ,బి.హారిక ,మహాలక్ష్మి ,హేమంత్ లకు 2000/-రూ విలువచేసే క్రీడాదుస్తులను ఇందుకూరి రఘురాజు సమకూర్చారు.2000/- షటిల్ కాక్స్ ను డా,ఎన్. సూర్యనారాయణ, కందుల కృష్ణ లు అందజేశారు.ఈ టోర్నమెంట్ కు బహుమతులను డా,ఎస్. వి.సత్యాశేఖర్,ఎ. ఎస్. వెంకటరావు లు సమకూర్చారు. టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులు సిద్దార్ద్ /వి.మనోహర్ జంట ప్రధమ, బి.హారిక/ రవి జంట ద్వితీయ స్థానాలు సాధించారని,ఉత్తమ క్రీడాకారుడిగా K. సాయి సాహిత్ నిలిచారు వీరికి రఘురాజు,సత్యాశేఖర్,వెంకటరావు ,కృష్ణ ల చేతులమీదుగా బహుమతులు అందించారని శ్రీరాములు తెలిపారు .ఈ కార్యక్రమంలో కోచ్ Md అస్లాం , Ch. నాయుడు ,కిడాకారుల పాల్గొన్నారు.
Image