<no title>

విజయనగరం....  మెరుగైన సేవలు అందించే సచివాలయ వ్యవస్థను బలోపేతం  చేయడానికి మరింత కృషి అవసరమని వార్డు కార్యదర్శులకు స్థానిక శాసనసభ్యులు, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు.
ప్రజలకు ఉత్తమ సేవలు అందించి, అవినీతి రహిత సమాజం ఏర్పరచాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో పరిపాలన మరియు మౌలిక వసతుల కల్పన కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. వినతిపత్రాన్ని కార్యదర్శులు సమర్పించారు. అనంతరం శాసన సభ్యులు కోలగట్ల మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా నివారణ ,నియంత్రణ చర్యలలో భాగంగా కార్యదర్శులకు కొంత అదనపు పనిభారం ఏర్పడిందని,కోవిడ్ సమస్య తీరిన వెంటనే సచివాలయ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజాసేవలు మరింత చేరువచేసేందుకే సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కరోనా నియంత్రణ చర్యలలో సచివాలయ వ్యవస్థ చేస్తున్న కృషిలో భాగంగా రాష్ట్రంలో మన నగరపాలిక నాలుగో స్థానంలో నిలవడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. అదే విధంగా నగర పాలక సంస్థ ఆర్థిక పరిపుష్టికి చేయూత  అందించాల్సిన బాధ్యత కూడా కార్యదర్శులదే నని అన్నారు. ఇప్పటికే 6 కోట్ల రూపాయల మేర కుళాయి కనెక్షన్ బకాయిలు ఉన్నాయని, వాటిని గుర్తించి ఇంకా నమోదు కాని నీటి పన్ను వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ ప్రజలకు 61 ప్రజా ఉపయోగ సేవలను అందివ్వడానికి సచివాలయ వ్యవస్థ రూపొందించబడిందని చెప్పారు. సమావేశంలో సహాయ కమిషనర్ ప్రసాదరావు,ఈ ఈ దిలీప్,డి.ఈ. నర్సింగరావు, ఆశపు వేణు, ఎస్ వి వి రాజేష్, కనకల ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
నౌ మరణం నాస్తికోద్యమనికి లోటు.(విశాఖపట్నం).నాస్తికోధ్యం నాయకురాలు నౌ మరణం తీరని లోటని భారత నాస్తిక సమాజం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు వై.నూకరాజు ఇక్కడ ప్రకటనలోసంతాపాన్ని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు ప్రముఖ నాస్తికోధ్యమ నాయకులు గోరా -సరస్వతి గార్ల 9 వ సంతానం అయిన నౌ విజయవాడ పరిసరప్రా0తాల్లో పలు సేవకార్యక్రమాలు నిరంతరం చేసారని ఇతరదేశా లవారితో కూడా సమాజ సేవా కార్యక్రమాలు చేసారని మహిళలు,వికలాంగుల సంక్షేమం కోసం,చిన్నారుల చదువు కోసం పలు కార్యక్రమాలు చేపట్టారని గోరా తమ పిల్లలకు (తమ సంతానం )కు కులమతాలకు అతీతంగా అర్ధ వంతమైన పేర్లు పెట్టారని వై.నూకరాజు తెలిపారు
Image
విలేకర్లకు నిత్యావసరాల పంపిణీ
రామ రాజ్యాన్ని తలపిస్తో0ది.యం. యల్.ఏ.కడు బండి శ్రీనివాసరావు
"వెలగని వీధి లైట్ తో ఇబ్బందులు"(శృంగవరపుకోట)స్థానిక శ్రీనివాసా కాలనీ లో సాహిణి వేణుగోపాల్ రావు,శీరాపు పాపన్న ఇంటి వద్ద ఉన్న వీధి లైట్ గత 10 రోజులు నుండి వెలగట0 లేదని స్థానికులు అంటున్నారు.ఫలితంగా ( పాదచారులు )ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు సంబంధిత అధికారులు స్పందించి వీధిలైట్ వెయ్యా లని స్థానికులు కోరుతున్నారు
Image
<no పేద క్రీడాకారులకు దాతల వితరణ శృంగవరపుకోట ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ లో ఆదివారం బాలల దినోత్సవం సందర్భాగా శిక్షణ పొందుతున్న సీనియర్ గ్రూప్ క్రీడాకారులకు డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించినట్లు చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. ఈ టోర్నమెంట్ లోగెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వడానికి సోమవారం ఉదయం ముఖ్యాతిధులుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుకూరి రఘురాజు , ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు డా,,ఎస్ వి సత్యాశేఖర్,స్నేహస్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు అట్లూరి శ్రీ వెంకటరావు లు వచ్చారు ఈ సందర్భంగా కోచ్ శ్రీరాములు మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ,వారి స్తితి గతులగురించి వివరిస్తూ వీరందరూ క్రిడల్లో మేటి - ఆర్ధికంగా వెనుకబాటు అని చెప్పగానే స్పందించి, వెంటనే 10,000/-రూ విలువచేసే( బ్యాట్లు,షూ,క్రీడాదుస్తులు,షటిల్ కాక్స్ మొ,,) క్రీడాపరికారాలను దాతలు అందజేశారు .ఎస్. కోట జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంచేస్తున్న కందుల కృష్ణ నీరజ కి1000/- బ్యాట్ ,మౌనిక కి 800/-రూ క్రీడాదుస్తులను,అలాగే స్నేహ స్వచ్చంద సేవా సంస్థ కార్యదర్శి మంతా సుబ్బారావు హరీష్ కి1500/-రూ క్రీడా బూట్లు ,వైజాగ్ కి చెందిన సన్ రైజ్ స్పోర్ట్స్ యజమాని ప్రసాద్ 3000/-రూ విలువచేసే లీనింగ్ బ్యాట్ అందించారు.నీరజ ,బి.హారిక ,మహాలక్ష్మి ,హేమంత్ లకు 2000/-రూ విలువచేసే క్రీడాదుస్తులను ఇందుకూరి రఘురాజు సమకూర్చారు.2000/- షటిల్ కాక్స్ ను డా,ఎన్. సూర్యనారాయణ, కందుల కృష్ణ లు అందజేశారు.ఈ టోర్నమెంట్ కు బహుమతులను డా,ఎస్. వి.సత్యాశేఖర్,ఎ. ఎస్. వెంకటరావు లు సమకూర్చారు. టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులు సిద్దార్ద్ /వి.మనోహర్ జంట ప్రధమ, బి.హారిక/ రవి జంట ద్వితీయ స్థానాలు సాధించారని,ఉత్తమ క్రీడాకారుడిగా K. సాయి సాహిత్ నిలిచారు వీరికి రఘురాజు,సత్యాశేఖర్,వెంకటరావు ,కృష్ణ ల చేతులమీదుగా బహుమతులు అందించారని శ్రీరాములు తెలిపారు .ఈ కార్యక్రమంలో కోచ్ Md అస్లాం , Ch. నాయుడు ,కిడాకారుల పాల్గొన్నారు.
Image