మధ్య నిషేధం అమలు చేయాలి :భారత నాస్తిక సమాజం డిమాండ్.: గాజువాక (ప్రజలుకోరే స్వేచ్ఛ న్యూస్):మద్య నిషేధం అమలుచేయాలని భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు తుంపాల శ్రీరామ మూర్తి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. కారోనా లాక్ డౌన్ తేదీ.22.03.2020 న ప్రారంభ మైనప్పటినుండి మద్యం అమ్మకాలు నిలిపేసారని ఫలితంగా మద్యం తాగే అలవాటు ను ప్రజలు మరిచిపోయారని అన్నారు. ప్రజల సంక్షేమం ను ఉల్లంఘించి న రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలనాల్గో తేదీ నుండి మద్యం అమ్మకాలు ప్రారంభించింది అని అన్నారు.మద్యం ఆదాయ వనరుగా ప్రభుత్వం అమలు చేయడం రాజ్యాంగ విరు ద్ధమని మద్యం వల్ల కుటుంభాలు ఛిద్రమవుతాయని ,నేరాలు ప్రమాదాలు జరుగుతాయని ఆలాగే గృహ హింసలు పెరుగుతాయని అందువల్ల మద్యంనిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 6,7,8, తేదీల్లో గృహ దీక్షలు చేస్తున్నామని ఆయన అన్నారు ఈరోజే గృహ దీక్ష లు ప్రారంభించామని భారత నాస్తిక సమాజ0 రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ మూర్తి చెప్పారు .ఫోటో రైటప్.గాజువాక (జోగవాని పాలెం)లోని తన స్వగృహం లో దీక్ష చేస్తున్న తుంపాల శ్రీరామ మూర్తి.


Popular posts
నౌ మరణం నాస్తికోద్యమనికి లోటు.(విశాఖపట్నం).నాస్తికోధ్యం నాయకురాలు నౌ మరణం తీరని లోటని భారత నాస్తిక సమాజం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు వై.నూకరాజు ఇక్కడ ప్రకటనలోసంతాపాన్ని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు ప్రముఖ నాస్తికోధ్యమ నాయకులు గోరా -సరస్వతి గార్ల 9 వ సంతానం అయిన నౌ విజయవాడ పరిసరప్రా0తాల్లో పలు సేవకార్యక్రమాలు నిరంతరం చేసారని ఇతరదేశా లవారితో కూడా సమాజ సేవా కార్యక్రమాలు చేసారని మహిళలు,వికలాంగుల సంక్షేమం కోసం,చిన్నారుల చదువు కోసం పలు కార్యక్రమాలు చేపట్టారని గోరా తమ పిల్లలకు (తమ సంతానం )కు కులమతాలకు అతీతంగా అర్ధ వంతమైన పేర్లు పెట్టారని వై.నూకరాజు తెలిపారు
Image
విలేకర్లకు నిత్యావసరాల పంపిణీ
రామ రాజ్యాన్ని తలపిస్తో0ది.యం. యల్.ఏ.కడు బండి శ్రీనివాసరావు
"వెలగని వీధి లైట్ తో ఇబ్బందులు"(శృంగవరపుకోట)స్థానిక శ్రీనివాసా కాలనీ లో సాహిణి వేణుగోపాల్ రావు,శీరాపు పాపన్న ఇంటి వద్ద ఉన్న వీధి లైట్ గత 10 రోజులు నుండి వెలగట0 లేదని స్థానికులు అంటున్నారు.ఫలితంగా ( పాదచారులు )ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు సంబంధిత అధికారులు స్పందించి వీధిలైట్ వెయ్యా లని స్థానికులు కోరుతున్నారు
Image
<no పేద క్రీడాకారులకు దాతల వితరణ శృంగవరపుకోట ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ లో ఆదివారం బాలల దినోత్సవం సందర్భాగా శిక్షణ పొందుతున్న సీనియర్ గ్రూప్ క్రీడాకారులకు డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించినట్లు చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. ఈ టోర్నమెంట్ లోగెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వడానికి సోమవారం ఉదయం ముఖ్యాతిధులుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుకూరి రఘురాజు , ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు డా,,ఎస్ వి సత్యాశేఖర్,స్నేహస్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు అట్లూరి శ్రీ వెంకటరావు లు వచ్చారు ఈ సందర్భంగా కోచ్ శ్రీరాములు మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ,వారి స్తితి గతులగురించి వివరిస్తూ వీరందరూ క్రిడల్లో మేటి - ఆర్ధికంగా వెనుకబాటు అని చెప్పగానే స్పందించి, వెంటనే 10,000/-రూ విలువచేసే( బ్యాట్లు,షూ,క్రీడాదుస్తులు,షటిల్ కాక్స్ మొ,,) క్రీడాపరికారాలను దాతలు అందజేశారు .ఎస్. కోట జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంచేస్తున్న కందుల కృష్ణ నీరజ కి1000/- బ్యాట్ ,మౌనిక కి 800/-రూ క్రీడాదుస్తులను,అలాగే స్నేహ స్వచ్చంద సేవా సంస్థ కార్యదర్శి మంతా సుబ్బారావు హరీష్ కి1500/-రూ క్రీడా బూట్లు ,వైజాగ్ కి చెందిన సన్ రైజ్ స్పోర్ట్స్ యజమాని ప్రసాద్ 3000/-రూ విలువచేసే లీనింగ్ బ్యాట్ అందించారు.నీరజ ,బి.హారిక ,మహాలక్ష్మి ,హేమంత్ లకు 2000/-రూ విలువచేసే క్రీడాదుస్తులను ఇందుకూరి రఘురాజు సమకూర్చారు.2000/- షటిల్ కాక్స్ ను డా,ఎన్. సూర్యనారాయణ, కందుల కృష్ణ లు అందజేశారు.ఈ టోర్నమెంట్ కు బహుమతులను డా,ఎస్. వి.సత్యాశేఖర్,ఎ. ఎస్. వెంకటరావు లు సమకూర్చారు. టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులు సిద్దార్ద్ /వి.మనోహర్ జంట ప్రధమ, బి.హారిక/ రవి జంట ద్వితీయ స్థానాలు సాధించారని,ఉత్తమ క్రీడాకారుడిగా K. సాయి సాహిత్ నిలిచారు వీరికి రఘురాజు,సత్యాశేఖర్,వెంకటరావు ,కృష్ణ ల చేతులమీదుగా బహుమతులు అందించారని శ్రీరాములు తెలిపారు .ఈ కార్యక్రమంలో కోచ్ Md అస్లాం , Ch. నాయుడు ,కిడాకారుల పాల్గొన్నారు.
Image