<no title>

*శాస్త్రీయ దృక్పదాన్ని అలవర్చుకోవాలి* లక్కవరపుకోట.(ప్రజలుకోరే స్వేచ్ఛ న్యూస్) :మూఢనమ్మకాలు లేని గ్రామాలు అవతరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టా లని జనజాగృతి సేవా సంస్థ ఉత్తరాంధ్ర కన్వీనర్ శీరాపు శ్రీనివాసరావు ఓప్రకటనలో తెలిపారు.విజయనగరం జిల్లా కొమరాడ మండలం చోళ్ళ పదం పంచాయతీ కునేరు గ్రామానికి చెందిన నిమ్మక సోమేశ్వర రావు కు 18 నెలల కుమార్తె ఉందని ఆమె అనారోగ్యంతో మరణిస్తే ఆ పాపకు కొందరు చిల్లంగి పెట్టారని అందువల్లే చనిపోయి0దని ,సింగన్న అనే వ్యక్తి చిల్లంగి పెట్టినందువల్లే తన కుమార్తె చనిపోయి0దని భావించిన గ్రామస్తులు సింగన్న పై దాడి చేశారని శ్రీనివాసరావు ఆప్రకటనలో పేర్కొన్నారు. దాడిచేసినందున సింగన్న మరణించాడని ఈ దాడిని ఖండిస్తున్నా నాని తెలిపారు. సింగన్న మరణం పై పత్రికలలో వార్తలు వచ్చాయని తెలిపారు,ఈ ఘటన పై పోలీస్ లు విచారణ జరిపి బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా అధికారులను కోరారు. చిల్లంగి పేరిట దారుణాలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా అధికారులను కోరారు.మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాల్లో చైతన్య సభలు పెట్టి చైతన్య పరచాలని, హేతు వాది బి.సాంబశివరావు రాసిన* సత్యశోధన* పుస్తకం లోని 20 కథలను వీధి నాటికలుగా ప్రభుత్వం రూపొందించి ఇబ్బడిముబ్బడిగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాల్లో ప్రదర్శి0చా లని శీరాపు శ్రీనివాసరావు ప్రభుత్వం ను కోరారు.వి.ఆర్.ఓ. లు గ్రామ పంచాయతీ కార్యదర్సుల తో ప్రత్యేక సర్వే నిర్వహించి1980 జనవరి ఒకటో తేదీ నుండి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ లో మూఢనమ్మకాల వలలో పడి మృతి చెందిన వారి(ఫోటోలు తో)వివరాలను అంతర్జాలంలో ప్రవేశపెట్టాలని  శ్రీనివా సరావు ఆప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.ప్రజలకు శాస్త్రీయ్య దృక్పథం అలవర్చుకోవర్చు కోడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని కోరారు


Popular posts
నౌ మరణం నాస్తికోద్యమనికి లోటు.(విశాఖపట్నం).నాస్తికోధ్యం నాయకురాలు నౌ మరణం తీరని లోటని భారత నాస్తిక సమాజం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు వై.నూకరాజు ఇక్కడ ప్రకటనలోసంతాపాన్ని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు ప్రముఖ నాస్తికోధ్యమ నాయకులు గోరా -సరస్వతి గార్ల 9 వ సంతానం అయిన నౌ విజయవాడ పరిసరప్రా0తాల్లో పలు సేవకార్యక్రమాలు నిరంతరం చేసారని ఇతరదేశా లవారితో కూడా సమాజ సేవా కార్యక్రమాలు చేసారని మహిళలు,వికలాంగుల సంక్షేమం కోసం,చిన్నారుల చదువు కోసం పలు కార్యక్రమాలు చేపట్టారని గోరా తమ పిల్లలకు (తమ సంతానం )కు కులమతాలకు అతీతంగా అర్ధ వంతమైన పేర్లు పెట్టారని వై.నూకరాజు తెలిపారు
Image
విలేకర్లకు నిత్యావసరాల పంపిణీ
రామ రాజ్యాన్ని తలపిస్తో0ది.యం. యల్.ఏ.కడు బండి శ్రీనివాసరావు
"వెలగని వీధి లైట్ తో ఇబ్బందులు"(శృంగవరపుకోట)స్థానిక శ్రీనివాసా కాలనీ లో సాహిణి వేణుగోపాల్ రావు,శీరాపు పాపన్న ఇంటి వద్ద ఉన్న వీధి లైట్ గత 10 రోజులు నుండి వెలగట0 లేదని స్థానికులు అంటున్నారు.ఫలితంగా ( పాదచారులు )ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు సంబంధిత అధికారులు స్పందించి వీధిలైట్ వెయ్యా లని స్థానికులు కోరుతున్నారు
Image
<no పేద క్రీడాకారులకు దాతల వితరణ శృంగవరపుకోట ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ లో ఆదివారం బాలల దినోత్సవం సందర్భాగా శిక్షణ పొందుతున్న సీనియర్ గ్రూప్ క్రీడాకారులకు డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించినట్లు చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. ఈ టోర్నమెంట్ లోగెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వడానికి సోమవారం ఉదయం ముఖ్యాతిధులుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుకూరి రఘురాజు , ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు డా,,ఎస్ వి సత్యాశేఖర్,స్నేహస్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు అట్లూరి శ్రీ వెంకటరావు లు వచ్చారు ఈ సందర్భంగా కోచ్ శ్రీరాములు మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ,వారి స్తితి గతులగురించి వివరిస్తూ వీరందరూ క్రిడల్లో మేటి - ఆర్ధికంగా వెనుకబాటు అని చెప్పగానే స్పందించి, వెంటనే 10,000/-రూ విలువచేసే( బ్యాట్లు,షూ,క్రీడాదుస్తులు,షటిల్ కాక్స్ మొ,,) క్రీడాపరికారాలను దాతలు అందజేశారు .ఎస్. కోట జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంచేస్తున్న కందుల కృష్ణ నీరజ కి1000/- బ్యాట్ ,మౌనిక కి 800/-రూ క్రీడాదుస్తులను,అలాగే స్నేహ స్వచ్చంద సేవా సంస్థ కార్యదర్శి మంతా సుబ్బారావు హరీష్ కి1500/-రూ క్రీడా బూట్లు ,వైజాగ్ కి చెందిన సన్ రైజ్ స్పోర్ట్స్ యజమాని ప్రసాద్ 3000/-రూ విలువచేసే లీనింగ్ బ్యాట్ అందించారు.నీరజ ,బి.హారిక ,మహాలక్ష్మి ,హేమంత్ లకు 2000/-రూ విలువచేసే క్రీడాదుస్తులను ఇందుకూరి రఘురాజు సమకూర్చారు.2000/- షటిల్ కాక్స్ ను డా,ఎన్. సూర్యనారాయణ, కందుల కృష్ణ లు అందజేశారు.ఈ టోర్నమెంట్ కు బహుమతులను డా,ఎస్. వి.సత్యాశేఖర్,ఎ. ఎస్. వెంకటరావు లు సమకూర్చారు. టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులు సిద్దార్ద్ /వి.మనోహర్ జంట ప్రధమ, బి.హారిక/ రవి జంట ద్వితీయ స్థానాలు సాధించారని,ఉత్తమ క్రీడాకారుడిగా K. సాయి సాహిత్ నిలిచారు వీరికి రఘురాజు,సత్యాశేఖర్,వెంకటరావు ,కృష్ణ ల చేతులమీదుగా బహుమతులు అందించారని శ్రీరాములు తెలిపారు .ఈ కార్యక్రమంలో కోచ్ Md అస్లాం , Ch. నాయుడు ,కిడాకారుల పాల్గొన్నారు.
Image