కరోనా సంక్లిష్టంలో జర్నలిస్టులకు చేయూత

- స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులకు నిత్యావసర వస్తువులు పంపిణీ


- మరువలేనిది  కాటూరి రవీంద్ర దాతృత్వం 


- పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా..డీసీపీ రంగారెడ్డి చేతుల మీదుగా జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు అందజేత


విశాఖపట్నం, ఏప్రిల్ 9


కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది...పేద,ధనిక అనే తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు...ప్రతీ నిమిషం ప్రజల సమస్యలను, కరోనా బారిన పడకుండా ప్రభుత్వం అందిస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పత్రికలు,టీవీల్లో తెలియజేస్తూ కుటుంబాలను వదిలి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎవరినీ సహాయం అడగని పరిస్థితి.. ఈ నేపద్యంలో కరోనా పరిస్థితుల్లో జర్మలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలిసిన స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ,  కాటూరి సూరన్న చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్,పారిశ్రామిక వేత్త కాటూరి రవీంద్ర  దృష్టికి తీసుకెళ్లారు...దీంతో ఆయన ముందుకు వచ్చి స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు..బుధవారం సిటీ పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో   పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా..డీసీపీ రంగారెడ్డి ల చేతుల మీదుగా జర్నలిస్టులకు పంపిణీ గావించారు...ఈ సందర్బంగా సీపీ ఆర్కే మీనా మాట్లాడుతూ   కరోనా వైరస్ పట్ల అజాగ్రత్ర,నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అన్నారు..లాక్ డౌన్ వరకు ప్రజలు ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకొని అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలి కోరారు..ఇతర రాష్ట్రాలు,దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు...కరోనా నేపథ్యంలో పేద,మధ్యతరగతి ప్రజల సమస్యలతో పాటుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి నిత్యావసర వస్తువులు అందించిన కాటూరి రవీంద్ర పలువురికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు..కాటూరి రవీంద్ర లాగానే పలువురు దాతలు ముందుకు వచ్చి కరోనా కాటీ ణ్యంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు సహాయం అందివ్వాలని కోరారు..అనంతరం డిసీపీ రంగారెడ్డి మాట్లాడుతూ  లాక్డౌన్ మొదలు కొని నేటి వరకు అనేక మంది దాతలు ముందుకు వచ్చి సేవా తత్పరతను చాటుకొని కరోనా ఈతి బాధల నుంచి అనేక మందిని బయటపడేస్తున్నారని అన్నారు..అందులో కాటూరి రవీంద్ర ఒకరని అన్నారు...జర్నలిస్టులను ఆదుకోవడానికి ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతో పాటుగా ఇంకా అనేక మందిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్న కాటూరి రవీంద్ర సేవలు మరువలేనివని కొనియాడారు..ఈ కార్యక్రమంలో ఈస్ట్ ఏసీపీ ...టూటౌన్  సిఐ శ్రీనివాసరావు...స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు నాగనబోయిన నాగేశ్వరరావు...బిఎస్ చంద్రశేఖర్..ఎస్వీబీ కుమార్ ...అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్...కార్యదర్శి కర్రి సత్యన్నారాయణ.. ఉపాధ్యక్షులు అజయ్ కుమార్..రిషికేశ్...కోశాధికారి అశోక్ రెడ్డి..సహా కార్యదర్సులు   కాళ్ళ సూర్య ప్రకాష్..రాజారావు..సభ్యులు విజయకుమార్...శరత్...వినోద్...రాజేష్...


Popular posts
నౌ మరణం నాస్తికోద్యమనికి లోటు.(విశాఖపట్నం).నాస్తికోధ్యం నాయకురాలు నౌ మరణం తీరని లోటని భారత నాస్తిక సమాజం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు వై.నూకరాజు ఇక్కడ ప్రకటనలోసంతాపాన్ని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు ప్రముఖ నాస్తికోధ్యమ నాయకులు గోరా -సరస్వతి గార్ల 9 వ సంతానం అయిన నౌ విజయవాడ పరిసరప్రా0తాల్లో పలు సేవకార్యక్రమాలు నిరంతరం చేసారని ఇతరదేశా లవారితో కూడా సమాజ సేవా కార్యక్రమాలు చేసారని మహిళలు,వికలాంగుల సంక్షేమం కోసం,చిన్నారుల చదువు కోసం పలు కార్యక్రమాలు చేపట్టారని గోరా తమ పిల్లలకు (తమ సంతానం )కు కులమతాలకు అతీతంగా అర్ధ వంతమైన పేర్లు పెట్టారని వై.నూకరాజు తెలిపారు
Image
విలేకర్లకు నిత్యావసరాల పంపిణీ
రామ రాజ్యాన్ని తలపిస్తో0ది.యం. యల్.ఏ.కడు బండి శ్రీనివాసరావు
"వెలగని వీధి లైట్ తో ఇబ్బందులు"(శృంగవరపుకోట)స్థానిక శ్రీనివాసా కాలనీ లో సాహిణి వేణుగోపాల్ రావు,శీరాపు పాపన్న ఇంటి వద్ద ఉన్న వీధి లైట్ గత 10 రోజులు నుండి వెలగట0 లేదని స్థానికులు అంటున్నారు.ఫలితంగా ( పాదచారులు )ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు సంబంధిత అధికారులు స్పందించి వీధిలైట్ వెయ్యా లని స్థానికులు కోరుతున్నారు
Image
<no పేద క్రీడాకారులకు దాతల వితరణ శృంగవరపుకోట ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ లో ఆదివారం బాలల దినోత్సవం సందర్భాగా శిక్షణ పొందుతున్న సీనియర్ గ్రూప్ క్రీడాకారులకు డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించినట్లు చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. ఈ టోర్నమెంట్ లోగెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వడానికి సోమవారం ఉదయం ముఖ్యాతిధులుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుకూరి రఘురాజు , ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు డా,,ఎస్ వి సత్యాశేఖర్,స్నేహస్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు అట్లూరి శ్రీ వెంకటరావు లు వచ్చారు ఈ సందర్భంగా కోచ్ శ్రీరాములు మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ,వారి స్తితి గతులగురించి వివరిస్తూ వీరందరూ క్రిడల్లో మేటి - ఆర్ధికంగా వెనుకబాటు అని చెప్పగానే స్పందించి, వెంటనే 10,000/-రూ విలువచేసే( బ్యాట్లు,షూ,క్రీడాదుస్తులు,షటిల్ కాక్స్ మొ,,) క్రీడాపరికారాలను దాతలు అందజేశారు .ఎస్. కోట జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంచేస్తున్న కందుల కృష్ణ నీరజ కి1000/- బ్యాట్ ,మౌనిక కి 800/-రూ క్రీడాదుస్తులను,అలాగే స్నేహ స్వచ్చంద సేవా సంస్థ కార్యదర్శి మంతా సుబ్బారావు హరీష్ కి1500/-రూ క్రీడా బూట్లు ,వైజాగ్ కి చెందిన సన్ రైజ్ స్పోర్ట్స్ యజమాని ప్రసాద్ 3000/-రూ విలువచేసే లీనింగ్ బ్యాట్ అందించారు.నీరజ ,బి.హారిక ,మహాలక్ష్మి ,హేమంత్ లకు 2000/-రూ విలువచేసే క్రీడాదుస్తులను ఇందుకూరి రఘురాజు సమకూర్చారు.2000/- షటిల్ కాక్స్ ను డా,ఎన్. సూర్యనారాయణ, కందుల కృష్ణ లు అందజేశారు.ఈ టోర్నమెంట్ కు బహుమతులను డా,ఎస్. వి.సత్యాశేఖర్,ఎ. ఎస్. వెంకటరావు లు సమకూర్చారు. టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులు సిద్దార్ద్ /వి.మనోహర్ జంట ప్రధమ, బి.హారిక/ రవి జంట ద్వితీయ స్థానాలు సాధించారని,ఉత్తమ క్రీడాకారుడిగా K. సాయి సాహిత్ నిలిచారు వీరికి రఘురాజు,సత్యాశేఖర్,వెంకటరావు ,కృష్ణ ల చేతులమీదుగా బహుమతులు అందించారని శ్రీరాములు తెలిపారు .ఈ కార్యక్రమంలో కోచ్ Md అస్లాం , Ch. నాయుడు ,కిడాకారుల పాల్గొన్నారు.
Image