దేశవ్యాప్తంగా 6వేలకు చేరువలో కోవిడ్ కేసులు.. 180 మంది మృతి

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సామూహిక దశలోకి ప్రవేశించిందని, ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా.. దీనిని ఇప్పుడే ఎత్తివేయడానికి కేంద్రం సముఖం లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. బుధవారం విపక్ష సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని, అందుకే కఠిన నిర్ణయాలు తీసుకున్నామని మోదీ పునరుద్ఘాటించారు. వైరస్ వేగాన్ని నియంత్రించి, ప్రజలను కాపాడటమే ప్రభుత్వం ముందున్న ప్రస్తుత లక్ష్యం. అలాగే, పలు రాష్ట్రాలు సైతం లాక్‌డౌన్ కొనసాగించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగింపునకే మోదీ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.


కాగా, ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన 8 రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు సగటున 500 వరకు నమోదవుతున్నాయి. బుధవారం దేశవ్యాప్తంగా మరో 600పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలోనూ కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. ఒక్క ఆ రాష్ట్రంలోనే కేసుల సంఖ్య 1,100 దాటింది. బుధవారం మరో 115 కేసులు నమోదు కావడంతో మొత్తం 1,135 మంది వైరస్ బారినపడ్డారు. గడచిన 24 గంటల్లో మహమ్మారి కారణంగా మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,916 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. 180 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 565 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉంది. బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 49 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు ఏపీలో 348, తెలంగాణలో 453కి చేరుకున్నాయి. ఏపీలో 9 మంది, తెలంగాణలో 43 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. అలాగే రెండు రాష్ట్రాల్లో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో కొత్తగా మరో 49 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 453కు పెరిగింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడి 11 మంది మృతిచెందగా.. 45 మంది పూర్తిగా కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రుల్లో 397 మంది చికిత్స పొందుతున్నారు.


Popular posts
నౌ మరణం నాస్తికోద్యమనికి లోటు.(విశాఖపట్నం).నాస్తికోధ్యం నాయకురాలు నౌ మరణం తీరని లోటని భారత నాస్తిక సమాజం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు వై.నూకరాజు ఇక్కడ ప్రకటనలోసంతాపాన్ని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు ప్రముఖ నాస్తికోధ్యమ నాయకులు గోరా -సరస్వతి గార్ల 9 వ సంతానం అయిన నౌ విజయవాడ పరిసరప్రా0తాల్లో పలు సేవకార్యక్రమాలు నిరంతరం చేసారని ఇతరదేశా లవారితో కూడా సమాజ సేవా కార్యక్రమాలు చేసారని మహిళలు,వికలాంగుల సంక్షేమం కోసం,చిన్నారుల చదువు కోసం పలు కార్యక్రమాలు చేపట్టారని గోరా తమ పిల్లలకు (తమ సంతానం )కు కులమతాలకు అతీతంగా అర్ధ వంతమైన పేర్లు పెట్టారని వై.నూకరాజు తెలిపారు
Image
విలేకర్లకు నిత్యావసరాల పంపిణీ
రామ రాజ్యాన్ని తలపిస్తో0ది.యం. యల్.ఏ.కడు బండి శ్రీనివాసరావు
"వెలగని వీధి లైట్ తో ఇబ్బందులు"(శృంగవరపుకోట)స్థానిక శ్రీనివాసా కాలనీ లో సాహిణి వేణుగోపాల్ రావు,శీరాపు పాపన్న ఇంటి వద్ద ఉన్న వీధి లైట్ గత 10 రోజులు నుండి వెలగట0 లేదని స్థానికులు అంటున్నారు.ఫలితంగా ( పాదచారులు )ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు సంబంధిత అధికారులు స్పందించి వీధిలైట్ వెయ్యా లని స్థానికులు కోరుతున్నారు
Image
<no పేద క్రీడాకారులకు దాతల వితరణ శృంగవరపుకోట ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ లో ఆదివారం బాలల దినోత్సవం సందర్భాగా శిక్షణ పొందుతున్న సీనియర్ గ్రూప్ క్రీడాకారులకు డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించినట్లు చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. ఈ టోర్నమెంట్ లోగెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వడానికి సోమవారం ఉదయం ముఖ్యాతిధులుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుకూరి రఘురాజు , ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు డా,,ఎస్ వి సత్యాశేఖర్,స్నేహస్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు అట్లూరి శ్రీ వెంకటరావు లు వచ్చారు ఈ సందర్భంగా కోచ్ శ్రీరాములు మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ,వారి స్తితి గతులగురించి వివరిస్తూ వీరందరూ క్రిడల్లో మేటి - ఆర్ధికంగా వెనుకబాటు అని చెప్పగానే స్పందించి, వెంటనే 10,000/-రూ విలువచేసే( బ్యాట్లు,షూ,క్రీడాదుస్తులు,షటిల్ కాక్స్ మొ,,) క్రీడాపరికారాలను దాతలు అందజేశారు .ఎస్. కోట జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంచేస్తున్న కందుల కృష్ణ నీరజ కి1000/- బ్యాట్ ,మౌనిక కి 800/-రూ క్రీడాదుస్తులను,అలాగే స్నేహ స్వచ్చంద సేవా సంస్థ కార్యదర్శి మంతా సుబ్బారావు హరీష్ కి1500/-రూ క్రీడా బూట్లు ,వైజాగ్ కి చెందిన సన్ రైజ్ స్పోర్ట్స్ యజమాని ప్రసాద్ 3000/-రూ విలువచేసే లీనింగ్ బ్యాట్ అందించారు.నీరజ ,బి.హారిక ,మహాలక్ష్మి ,హేమంత్ లకు 2000/-రూ విలువచేసే క్రీడాదుస్తులను ఇందుకూరి రఘురాజు సమకూర్చారు.2000/- షటిల్ కాక్స్ ను డా,ఎన్. సూర్యనారాయణ, కందుల కృష్ణ లు అందజేశారు.ఈ టోర్నమెంట్ కు బహుమతులను డా,ఎస్. వి.సత్యాశేఖర్,ఎ. ఎస్. వెంకటరావు లు సమకూర్చారు. టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులు సిద్దార్ద్ /వి.మనోహర్ జంట ప్రధమ, బి.హారిక/ రవి జంట ద్వితీయ స్థానాలు సాధించారని,ఉత్తమ క్రీడాకారుడిగా K. సాయి సాహిత్ నిలిచారు వీరికి రఘురాజు,సత్యాశేఖర్,వెంకటరావు ,కృష్ణ ల చేతులమీదుగా బహుమతులు అందించారని శ్రీరాములు తెలిపారు .ఈ కార్యక్రమంలో కోచ్ Md అస్లాం , Ch. నాయుడు ,కిడాకారుల పాల్గొన్నారు.
Image