మార్చి 23 వరకు ఢిల్లీ నుంచి ఏపీ, తెలంగాణకు 2.20 లక్షల మంది.. రైల్వే వెల్లడి

దేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడానికి ఢిల్లీలోని నిజాముద్దీన మర్కజ్ ప్రార్థనలు కారణమయ్యాయి. మార్చి 1 నుంచి 15 వరకు జరిగిన తబ్లీగ్ జమాత్ సమ్మేళనానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. గడచిన నాలుగు రోజుల్లో దాదాపు 2,000 కేసులు నమోదుకాగా, 70 శాతం మంది వీరే ఉన్నారు. ఢిల్లీ జమాత్ ప్రార్థనలకు వెళ్లివచ్చినవారితోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. అయితే, ఈ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారిలో కొంత మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు.


దీంతో మరింత ఆందోళన మొదలైంది. కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున వారిని పూర్తిస్థాయిలో గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ నుంచి రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు వచ్చినవారి జాబితాను దక్షిణ మధ్య రైల్వే అందజేసింది. తబ్లీగ్ జమాత్ ప్రార్థనల్లో పాల్గొనవారిని గుర్తించడానికి ప్రస్తుతం ఈ జాబితా కీలకంగా మారింది.

మర్కజ్‌ సమ్మేళనం మార్చి 1 నుంచి 15 వరకు జరిగింది. ఈ నేపథ్యంలో మార్చి 11 నుంచి 23 వరకు ఢిల్లీ నుంచి వచ్చిన అన్ని రైళ్ల సమాచారం కావాలని దక్షిణ మధ్య రైల్వేను తెలుగు రాష్ట్రాల అధికారులు కోరారు. దీంతో ఆ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వచ్చిన 2.20 లక్షల మంది పేర్లు, సెల్‌ నంబర్‌, చిరునామాలను సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (క్రిస్‌) అధికారులు అందజేశారు. తెలంగాణ, ఏపీ పరిధిలోని రైల్వే స్టేషన్లలో దిగిన ప్రయాణికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందించారు.

అలాగే, ముంబయి, పుణె, నాగ్‌పూర్‌ తదితర స్టేషన్లలో దిగిన ప్రయాణికుల సమాచారాన్ని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా రైల్వేశాఖ అందించిన జాబితా ఆధారంగా ఇప్పటివరకు క్వారంటైన్‌లోకి వెళ్లని వారిని గుర్తించే పనిని ముమ్మరం చేసినట్లు తెలంగాణకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

అయితే, తబ్లీగ్ జమాత్‌కు వెళ్లొచ్చినవారిలో ఎంతమంది దొరకలేదన్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. తెలంగాణ నుంచి మొత్తం 1,030 మంది తబ్లిగీ జమాత్‌ కార్యక్రమానికి వెళ్లి రాగా వారిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 603 మంది, జిల్లాలకు చెందిన వారు 427 మంది ఉన్నారు. జిల్లాల వారిలో కరోనా లక్షణాలు ఉన్న వారిని చికిత్సకు, లేనివారిని క్వారంటైన్‌కు తరలించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల మాత్రం మిగిలిపోయిన వారి కోసం గాలింపు జరుగుతూనే ఉంది. ఏపీలోనూ దాదాపు 1,000 మంది ఢిల్లీకి వెళ్లొచ్చారు.


Popular posts
నౌ మరణం నాస్తికోద్యమనికి లోటు.(విశాఖపట్నం).నాస్తికోధ్యం నాయకురాలు నౌ మరణం తీరని లోటని భారత నాస్తిక సమాజం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు వై.నూకరాజు ఇక్కడ ప్రకటనలోసంతాపాన్ని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు ప్రముఖ నాస్తికోధ్యమ నాయకులు గోరా -సరస్వతి గార్ల 9 వ సంతానం అయిన నౌ విజయవాడ పరిసరప్రా0తాల్లో పలు సేవకార్యక్రమాలు నిరంతరం చేసారని ఇతరదేశా లవారితో కూడా సమాజ సేవా కార్యక్రమాలు చేసారని మహిళలు,వికలాంగుల సంక్షేమం కోసం,చిన్నారుల చదువు కోసం పలు కార్యక్రమాలు చేపట్టారని గోరా తమ పిల్లలకు (తమ సంతానం )కు కులమతాలకు అతీతంగా అర్ధ వంతమైన పేర్లు పెట్టారని వై.నూకరాజు తెలిపారు
Image
విలేకర్లకు నిత్యావసరాల పంపిణీ
రామ రాజ్యాన్ని తలపిస్తో0ది.యం. యల్.ఏ.కడు బండి శ్రీనివాసరావు
"వెలగని వీధి లైట్ తో ఇబ్బందులు"(శృంగవరపుకోట)స్థానిక శ్రీనివాసా కాలనీ లో సాహిణి వేణుగోపాల్ రావు,శీరాపు పాపన్న ఇంటి వద్ద ఉన్న వీధి లైట్ గత 10 రోజులు నుండి వెలగట0 లేదని స్థానికులు అంటున్నారు.ఫలితంగా ( పాదచారులు )ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు సంబంధిత అధికారులు స్పందించి వీధిలైట్ వెయ్యా లని స్థానికులు కోరుతున్నారు
Image
<no పేద క్రీడాకారులకు దాతల వితరణ శృంగవరపుకోట ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ లో ఆదివారం బాలల దినోత్సవం సందర్భాగా శిక్షణ పొందుతున్న సీనియర్ గ్రూప్ క్రీడాకారులకు డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించినట్లు చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. ఈ టోర్నమెంట్ లోగెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వడానికి సోమవారం ఉదయం ముఖ్యాతిధులుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుకూరి రఘురాజు , ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు డా,,ఎస్ వి సత్యాశేఖర్,స్నేహస్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు అట్లూరి శ్రీ వెంకటరావు లు వచ్చారు ఈ సందర్భంగా కోచ్ శ్రీరాములు మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ,వారి స్తితి గతులగురించి వివరిస్తూ వీరందరూ క్రిడల్లో మేటి - ఆర్ధికంగా వెనుకబాటు అని చెప్పగానే స్పందించి, వెంటనే 10,000/-రూ విలువచేసే( బ్యాట్లు,షూ,క్రీడాదుస్తులు,షటిల్ కాక్స్ మొ,,) క్రీడాపరికారాలను దాతలు అందజేశారు .ఎస్. కోట జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంచేస్తున్న కందుల కృష్ణ నీరజ కి1000/- బ్యాట్ ,మౌనిక కి 800/-రూ క్రీడాదుస్తులను,అలాగే స్నేహ స్వచ్చంద సేవా సంస్థ కార్యదర్శి మంతా సుబ్బారావు హరీష్ కి1500/-రూ క్రీడా బూట్లు ,వైజాగ్ కి చెందిన సన్ రైజ్ స్పోర్ట్స్ యజమాని ప్రసాద్ 3000/-రూ విలువచేసే లీనింగ్ బ్యాట్ అందించారు.నీరజ ,బి.హారిక ,మహాలక్ష్మి ,హేమంత్ లకు 2000/-రూ విలువచేసే క్రీడాదుస్తులను ఇందుకూరి రఘురాజు సమకూర్చారు.2000/- షటిల్ కాక్స్ ను డా,ఎన్. సూర్యనారాయణ, కందుల కృష్ణ లు అందజేశారు.ఈ టోర్నమెంట్ కు బహుమతులను డా,ఎస్. వి.సత్యాశేఖర్,ఎ. ఎస్. వెంకటరావు లు సమకూర్చారు. టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులు సిద్దార్ద్ /వి.మనోహర్ జంట ప్రధమ, బి.హారిక/ రవి జంట ద్వితీయ స్థానాలు సాధించారని,ఉత్తమ క్రీడాకారుడిగా K. సాయి సాహిత్ నిలిచారు వీరికి రఘురాజు,సత్యాశేఖర్,వెంకటరావు ,కృష్ణ ల చేతులమీదుగా బహుమతులు అందించారని శ్రీరాములు తెలిపారు .ఈ కార్యక్రమంలో కోచ్ Md అస్లాం , Ch. నాయుడు ,కిడాకారుల పాల్గొన్నారు.
Image