ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఒకేసారి ఎత్తేయరు.. ప్రధాని మోదీ సంకేతం

లాక్‌డౌన్ పొడిగిస్తారా దేశంలో ఇప్పుడిదే హాట్ టాపిక్. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించింది. ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అయితే.. లాక్‌డౌన్‌తో కరోనా కేసులు తగ్గుతాయని ఆశించగా.. రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ విషయంపై తాజాగా ఆయన సంకేతం ఇచ్చారు. ఏప్రిల్ 14 తర్వాత దేశంలో లాక్‌డౌన్‌ను ఒకేసారి మాత్రం ఎత్తేసే పరిస్థితి లేదని చెప్పారు. పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లతో బుధవారం (ఏప్రిల్ 8) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌పై సంకేతాలిచ్చారు.


ఏప్రిల్ 14 తర్వాత దేశంలో దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని బీజేడీ ఎంపీ పినాకీ మిశ్రా అన్నారు. లాక్‌డౌన్ ఒకేసారి ఎత్తేసే పరిస్థితి మాత్రం లేదని ప్రధాని మోదీ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధానితో సమావేశం అనంతరం ఆయన పీటీఐ ప్రతినిధితో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర రావు ప్రగతి భవన్ నుంచి ఈ సమావేవంలో పాల్గొన్నారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూాడా ఉన్నారు.

కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ యథావిధిగా కొనసాగిస్తూ.. మిగిలిన ప్రాంతాల్లో పాక్షికంగా ఎత్తివేసే యోచనలో ప్రధాని మోదీ ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరి కొన్ని రోజులు పొడిగించాలని వివిధ రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా అందుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా పలువురు ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడిగించాలని కోరుతున్నారు.


ముఖ్యమంత్రులతో మరోసారి చర్చించి..
లాక్‌డౌన్‌ను పొడిగించడానికే మెజార్టీ రాష్ట్రాలు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో ప్రధాని దీనిపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మరోమారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న ఈ సమావేశం ఉంటుందని తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత లాక్‌డౌన్‌పై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.


Popular posts
నౌ మరణం నాస్తికోద్యమనికి లోటు.(విశాఖపట్నం).నాస్తికోధ్యం నాయకురాలు నౌ మరణం తీరని లోటని భారత నాస్తిక సమాజం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు వై.నూకరాజు ఇక్కడ ప్రకటనలోసంతాపాన్ని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు ప్రముఖ నాస్తికోధ్యమ నాయకులు గోరా -సరస్వతి గార్ల 9 వ సంతానం అయిన నౌ విజయవాడ పరిసరప్రా0తాల్లో పలు సేవకార్యక్రమాలు నిరంతరం చేసారని ఇతరదేశా లవారితో కూడా సమాజ సేవా కార్యక్రమాలు చేసారని మహిళలు,వికలాంగుల సంక్షేమం కోసం,చిన్నారుల చదువు కోసం పలు కార్యక్రమాలు చేపట్టారని గోరా తమ పిల్లలకు (తమ సంతానం )కు కులమతాలకు అతీతంగా అర్ధ వంతమైన పేర్లు పెట్టారని వై.నూకరాజు తెలిపారు
Image
విలేకర్లకు నిత్యావసరాల పంపిణీ
రామ రాజ్యాన్ని తలపిస్తో0ది.యం. యల్.ఏ.కడు బండి శ్రీనివాసరావు
"వెలగని వీధి లైట్ తో ఇబ్బందులు"(శృంగవరపుకోట)స్థానిక శ్రీనివాసా కాలనీ లో సాహిణి వేణుగోపాల్ రావు,శీరాపు పాపన్న ఇంటి వద్ద ఉన్న వీధి లైట్ గత 10 రోజులు నుండి వెలగట0 లేదని స్థానికులు అంటున్నారు.ఫలితంగా ( పాదచారులు )ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు సంబంధిత అధికారులు స్పందించి వీధిలైట్ వెయ్యా లని స్థానికులు కోరుతున్నారు
Image
<no పేద క్రీడాకారులకు దాతల వితరణ శృంగవరపుకోట ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ లో ఆదివారం బాలల దినోత్సవం సందర్భాగా శిక్షణ పొందుతున్న సీనియర్ గ్రూప్ క్రీడాకారులకు డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించినట్లు చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. ఈ టోర్నమెంట్ లోగెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వడానికి సోమవారం ఉదయం ముఖ్యాతిధులుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుకూరి రఘురాజు , ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు డా,,ఎస్ వి సత్యాశేఖర్,స్నేహస్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు అట్లూరి శ్రీ వెంకటరావు లు వచ్చారు ఈ సందర్భంగా కోచ్ శ్రీరాములు మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ,వారి స్తితి గతులగురించి వివరిస్తూ వీరందరూ క్రిడల్లో మేటి - ఆర్ధికంగా వెనుకబాటు అని చెప్పగానే స్పందించి, వెంటనే 10,000/-రూ విలువచేసే( బ్యాట్లు,షూ,క్రీడాదుస్తులు,షటిల్ కాక్స్ మొ,,) క్రీడాపరికారాలను దాతలు అందజేశారు .ఎస్. కోట జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంచేస్తున్న కందుల కృష్ణ నీరజ కి1000/- బ్యాట్ ,మౌనిక కి 800/-రూ క్రీడాదుస్తులను,అలాగే స్నేహ స్వచ్చంద సేవా సంస్థ కార్యదర్శి మంతా సుబ్బారావు హరీష్ కి1500/-రూ క్రీడా బూట్లు ,వైజాగ్ కి చెందిన సన్ రైజ్ స్పోర్ట్స్ యజమాని ప్రసాద్ 3000/-రూ విలువచేసే లీనింగ్ బ్యాట్ అందించారు.నీరజ ,బి.హారిక ,మహాలక్ష్మి ,హేమంత్ లకు 2000/-రూ విలువచేసే క్రీడాదుస్తులను ఇందుకూరి రఘురాజు సమకూర్చారు.2000/- షటిల్ కాక్స్ ను డా,ఎన్. సూర్యనారాయణ, కందుల కృష్ణ లు అందజేశారు.ఈ టోర్నమెంట్ కు బహుమతులను డా,ఎస్. వి.సత్యాశేఖర్,ఎ. ఎస్. వెంకటరావు లు సమకూర్చారు. టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులు సిద్దార్ద్ /వి.మనోహర్ జంట ప్రధమ, బి.హారిక/ రవి జంట ద్వితీయ స్థానాలు సాధించారని,ఉత్తమ క్రీడాకారుడిగా K. సాయి సాహిత్ నిలిచారు వీరికి రఘురాజు,సత్యాశేఖర్,వెంకటరావు ,కృష్ణ ల చేతులమీదుగా బహుమతులు అందించారని శ్రీరాములు తెలిపారు .ఈ కార్యక్రమంలో కోచ్ Md అస్లాం , Ch. నాయుడు ,కిడాకారుల పాల్గొన్నారు.
Image