తాజాగా ప్రకటించిన ఇద్దరు బాధితుల్లో దిల్లీకి చెందిన వ్యక్తి గతంలో ఇటలీ వెళ్లి రాగా, తెలంగాణకు చెందిన వ్యక్తి గతంలో దుబాయ్ వెళ్లి వచ్చారు. బాధితులు ఇద్దరూ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు.
భారతీయులెవ్వరూ చైనా, ఇటలీ, కొరియా, సింగపూర్ దేశాలకు ప్రయాణించవద్దని మంత్రి హర్షవర్ధన్ సూచించారు. చైనా, ఇరాన్ దేశాలకు ఈ వీసాలతో సహా, ఇతర వీసాలను జారీ చేయడం నిలిపేశామని, పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండటంతో వైరస్ ప్రభావితమైన ఇతర దేశాలకు కూడా మున్ముందు ఇది వర్తింపజేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు .
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 21 విమనాశ్రయాల్లోనూ మొత్తం 5,57,431 ప్రయాణీకులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా... 12 భారీ నౌకాశ్రయాల్లోనూ, 65 చిన్న తరహా నౌకాశ్రయాల్లో 12,431 మందికి కరోనావైరస్ పరీక్షలు నిర్వహించినట్లు హర్షవర్ధన్ తెలిపారు .